మేడిపల్లి, ఫిబ్రవరి 28: జగిత్యాల జిల్లా మోత్కురావుపేటలో పెద్దపల్లి కలకలం రేపింది. శుక్రవారం రాత్రి గ్రామానికి చెందిన ఏనుగుల రాజలింగం పశువుల మందలో మూడింటిపై దాడిచేసింది. శనివారం అటవీశాఖ, పశువైద్య సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. పశువులు, పరిసరాల్లో పాదముద్రలను పరిశీలించి పెద్దపులిగా నిర్ధారించారు. టైగర్ ఐటీ కోర్సు మల్లేశ్ ఆధ్వర్యంలో ఆనవాళ్లను గుర్తించారు. గాయాలైన పశువులకు వెటర్నరీ వైద్యులు వెన్నెల, శ్రీనివాస్ వైద్యం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా వెళ్లవద్దని, గుంపులుగా వెళ్లాలని అటవీశాఖ సిబ్బంది సూచించారు.