భీమ్గల్, ఏప్రిల్ 9: పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం మండల నాయకులు శనివారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోదీ సర్కారు పెట్రోల్, డీజిల్ ధరలను అడ్డగోలుగా పెంచుతూ సా మాన్య ప్రజలపై పెనుభారాన్ని మోపుతుందని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంతో నిత్యావసర సరుకులకు రెక్కలు వస్తాయన్నారు. ఈ ర్యాలీ లో సోషల్ మీడియా మండల నాయకులు మొండి ప్రశాంత్, పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు నీలం రవి, వారియర్స్ టీమ్ సభ్యులు అశోక్, రఘు, సునీల్, చింటు, మహేశ్, అరవింద్, గంధం మహిపాల్, అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు.