ఎక్కడైనా ప్రాజెక్టుకు క్రస్ట్ గేట్లు ఉంటాయి. చెరువుకు గేట్లు అంటూ ఉండవు. కానీ, కామారెడ్డి జిల్లాలోని బీబీపేట పెద్ద చెరువుకు 25 ఇనుప గేట్లను అమర్చారు. ఆనకట్ట ఎత్తు పెంచకుండానే గేట్ల ద్వారా నీటిని చెరువులో నిలువరించే టెక్నాలజీని నిజాం పాలకులు ఆనాడే నెలకొల్పడం విశేషం. మత్తడిపై ఏర్పాటుచేసిన 25 గేట్ల ద్వారా అడుగున్నర ఎత్తులో నీటిని నిల్వ చేసుకొనే సౌలభ్యం ఉన్నది. 510 ఎకరాల్లో విస్తరించిన చెరువుకు మూడు వేల ఎకరాల ఆయకట్టు ఉన్నది. నిజాం కాలంలో ఐదు తూములతో నిర్మించిన ఈ తటాకం ఉమ్మడి రాష్ట్రంలో 1996లో చివరిసారిగా నిండింది. స్వరాష్ట్రంలో దీనిని రూ.1.44 కోట్లతో అభివృద్ధి పరిచారు. 2021లో కురిసిన భారీ వానలతో బీబీపేట చెరువుకు వరదలు వచ్చాయి. మొన్నటి
సీజన్లో అతి భారీ వానలు రావడంతో చెరువు నిండుకుండలా మారింది. -నిజామాబాద్, నమస్తే తెలంగాణ ప్రతినిధి