నందికొండ, నవంబర్ 24: అంతర్జాతీయ స్థాయిలో నల్లగొండ జిల్లా నందికొండ హిల్కాలనీలో నిర్మించిన బుద్ధవనాన్ని భూటాన్ దేశానికి చెందిన 23 జిల్లాల బౌద్ధ ప్రతినిధుల బృందం గురువారం సందర్శించింది. బుద్ధవనంలో బుద్ధుడి పాదాలకు పుష్పాంజలి ఘటించి ప్రార్థనలు చేశారు.
అనంతరం బుద్ధవనం, జాతక పార్కు, మహాస్థూపం, ధ్యానమందిరాన్ని సందర్శించారు. ఆచార్య నాగార్జునుడు నడయాడిన నేలపై నిర్మించిన ఈ బుద్ధవనం తెలంగాణకు మణిహారంగా నిలుస్తుందని పేర్కొన్నారు.