హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 26: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న కాకా వెంకటస్వామి(Kaka Venkataswamy) మెమోరియా ఇంటర్ డిస్ట్రిక్ట్ టి-20 క్రికెట్ లీగ్ ఫైనల్ తలపడిన హనుమకొండ-భూపాలపల్లి జిల్లాల మధ్య హోరాహోరీగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో భూపాలపల్లి జట్టు విజేతగా నిలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొన్న హనుమకొండ జట్టు 7 వికెట్ల నష్టానికి 107 పరుగులు సాధించింది. హనుమకొండ జట్టులో పవన్రాజ్ 36, ప్రదీప్ 27 పరుగులతో రాణించగా భూపాలపల్లి బౌలర్ 4 వికెట్లతో కట్టడి చేశాడు.
108 పరుగుల లక్షఛేదనలో బరిలోకి దిగిన భూపాలపల్లి జట్టు మరో 6 బంతులు మిగిలి ఉండగానేలో అవినాష్రెడ్డి 58 పరుగులు సాధించి విజయంలో కీలక భూమిక సాధించాడు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు అచ్చ వెంకటేశ్వర్రావు, రఘురాం, రాము, సంయుక్త కార్యదర్శి బస్వరాజు ఉపేందర్, కార్యవర్గ సభ్యులు అభినవవినయ్, శంకర్ పాల్గొన్నారు. ఈనెల 29 నుంచి ఉప్పల్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ టీ-20కి జట్టును ఎంపిక చేసినట్లు వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ తెలిపారు.
జట్టు వివరాలు: కె ప్రదీప్(హన్మకొండ), కి.రోహిత్ రెడ్డి(హన్మకొండ), చంద్ర(వరంగల్), ఎం.శివరాంకృష్ణ(జనగాం), పి.రిష్యాంత్(వరంగల్), జి.పవన్రాజ్(హన్మకొండ), ఎన్.రాహుల్(వరంగల్),
ఎస్.ఆదర్శ్(భూపాలపల్లి), జే.పర్దీపన్(హన్మకొండ), ఏ.నాగరాజు(భూపాలపల్లి), త్రిశూల్(హన్మకొండ), జి.సాయికుమార్(మహబూబాబాద్), ఎస్డి.రియాజ్ (ములుగు), ఆశ్లేష్వర్మ(హైదరాబాద్), కె.శ్రీఅఖిలేష్ (హైదరాబాద్), ఆకాష్ కుర్రె (హైదరాబాద్), ఆవుల నిక్షిత్(హైదరాబాద్), అరుష్ పావులేచి (హైద్రాబాద్)