హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): శంషాబాద్లో నూతనంగా నిర్మించనున్న హైదరాబాద్ కస్టమ్స్ హౌస్కు సోమవారం భూమిపూజ నిర్వహించారు. సీబీఐసీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్) మెంబర్ వివేక్ రంజన్ భూమిపూజ చేయగా, సెంట్రల్ జీఎస్టీ చీఫ్ కమిషనర్ సందీప్ ప్రకాశ్, ఇతర అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
రూ.44 కోట్ల వ్యయంతో చేపట్టిన కస్టమ్స్ నూతన పరిపాలనా భవన నిర్మాణం 2025 నాటికి పూర్తి కానున్నది. ఎయిర్పోర్ట్కు సమీపంలోని మామిడిపల్లిలో నాలుగు అంతస్తుల ఈ నూతన భవనం అత్యాధునిక వసతులతో అందుబాటులోకి రానున్నది.