రామచంద్రాపురం, ఫిబ్రవరి 18: సంగారెడ్డి జిల్లా ఆర్సీపురంలోని భెల్ సంస్థ ఏడు క్యాటగిరీల్లో అవార్డులను గెలుచుకున్నదని ఆ సంస్థ ఈడీ వరదరాజన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గవర్నెన్స్ నౌ 2022 విభాగంలో ఏడు క్యాటగిరీల్లో అవార్డులు వచ్చినట్టు ఆయన పేర్కొన్నారు.
ఈ అవార్డులను భెల్ సీఎండీ డాక్టర్ నళినీసింఘాల్, డైరెక్టర్ (పవర్) ఉపేందర్సింగ్ మాథారు, డైరెక్టర్ (ఈఆర్డీ) జైప్రకాశ్ శ్రీవాస్తవ అందుకున్నారని, భెల్ సీసీ జనరల్ మేనేజర్ సీమా నానయ్యకు కమ్యూనికేషన్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కిందని ఆయన తెలిపారు.