హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): వేసవిలో విద్యుత్తు కొరత రాకుండా అన్ని థర్మల్ కేంద్రాలతోపాటు ఇతర రాష్ట్రాల్లోని థర్మ ల్ కేంద్రాలకు నిరంతరాయంగా బొగ్గును రవా ణా చేయాలని సింగరేణి ఉన్నతాధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార ఆదేశించారు. ఆ సంస్థలోని అన్ని విభాగాలపై శుక్రవారం ఆయన సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
2023-24 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న ఉత్పత్తి లక్ష్యాలు, ఇప్పటివరకు సాధించిన ప్రగతి గురించి తెలుసుకుని, తదుపరి కార్యాచరణపై దిశా నిర్దేశం చేశారు. సింగరేణి కార్మికుల సంక్షేమంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆదేశించారు. కొన్ని బొగ్గు బ్లాకులను వేలం వేయాలన్న కేంద్రం ప్రతిపాదనను కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నందున సంస్థకు మేలు జరిగేలా నిర్ణ యం తీసుకోవాలని డిప్యూటీ సీఎంకు అధికా రులు విజ్ఞప్తి చేశారు. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అధ్యయనం చేసినట్టు తెలిపారు.