వరంగల్: వరంగల్లోని చారిత్రక భద్రకాళి చెరుకువుకు (Bhadrakali Cheruvu) గండిపడింది. ఎగువనుంచి వరద పోటెత్తడంతో చెరువులోకి భారీగా నీరు వచ్చిచేరింది. సామర్థ్యానికి మించి వరద రావడంతో చెరువు కట్ట తెగిపోయింది. దీంతో పోతననగర్, రంగంపేట, భద్రకాళి ఆలయ పరిసర ప్రాంతాలను వరద ముంచెత్తింది. అయితే అప్రమత్తమైన వరంగల్ నగరపాలక సంస్థ సిబ్బంది.. హుటాహుటిని గండిపడిన ప్రాంతానికి చేరుకున్నారు. చెరువు కట్టకు మరమ్మతులు చేపట్టారు. కాగా, చెరువుకు గండిపడిన ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. లోతట్లు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు.
#TelanganaFloods వరంగల్ భద్రకాళి చెరువుకు గండి.. రెండు కాలనీలకు పొంచి ఉన్న ముప్పు.. pic.twitter.com/HAlUplDk4t
— raghu addanki (@raghuaddanki1) July 29, 2023