హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ) : భద్రాద్రి సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలకు భక్తుల నుంచి అనూహ్య స్పందన వస్తున్నది. పది రోజుల్లోనే 50 వేల మంది భక్తులు తలంబ్రాల కోసం బుకింగ్ చేసుకొన్నారు. ఈ నెల 30న శ్రీరామ నవ మి సందర్భంగా భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది.
కార్గో పార్శిల్ సెంటర్ ద్వారా రూ.116 చెల్లించి బుక్ చేసుకొంటే తలంబ్రాలను భక్తులకు హోం డెలివరీ చేయనున్నది. శ్రీరామనవమి కల్యాణ సమయంలోనే కాకుండా భక్తులు పొందే అవకా శాన్ని కల్పిస్తున్నట్టు టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. తలంబ్రాల బుకింగ్కు 9177683134, 7382924900, 9154 680020 నంబర్లను సంప్రదించాలన్నారు.