భద్రాచలం : భద్రాద్రి రామయ్య హుండీ ఆదాయం రూ.1.04 కోట్లు వచ్చిందని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఈవో బానోత్ శివాజీ తెలిపారు. ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో గురువారం దేవస్థానం హుండీలను లెక్కించినట్లు చెప్పారు. 56 రోజులకు గాను రూ.1.04 కోట్లు ఆదాయం సమకూరిందన్నారు.
భక్తులు రామయ్యకు సమర్పించిన కానుల్లో బంగారం 50 గ్రాములు, వెండి 2.200 కేజీలు ఉన్నట్లు చెప్పారు. అలాగే 1084 అమెరికన్ డాలర్లు, 10 ఆస్ట్రేలియన్ డాలర్లు, 6 ఖతార్ రియాల్స్, కువైట్ దినార్, 5 నేపాల్ రూపాయలు వచ్చినట్లు వివరించారు. చివరిసారిగా సెప్టెంబర్ 15న (70 రోజులకు) హుండీలను లెక్కించినప్పుడు రూ.86.02 లక్షలు ఆదాయం వచ్చిందని గుర్తుచేశారు. గతం కంటే ఈసారి ఆదాయం పెరిగినట్లు ఈవో చెప్పారు.