హైదరాబాద్, ఏప్రిల్ 13(నమస్తే తెలంగాణ): భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామచంద్ర స్వామివారి కల్యాణం, మహోత్సవాలను తిలకించేందుకు వచ్చే భక్తులకు వసతి సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నట్టు అధికారులు చెప్పారు. సామాన్య భక్తులతోపాటు అందరికీ టికెట్ల వివరాలను, వసతి కోసం గదులను ఆన్లైన్లో అందుబాటులో ఉంచామని వెల్లడించారు. bhadradritemple.telangana.gov.in వెబ్సైట్ నుంచి టికెట్లు బుక్ చేసుకోవచ్చని సూచించారు.