భద్రాద్రి: దక్షిణాది అయోధ్య భద్రాద్రిలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రోజుకో రూపంలో శ్రీరామచంద్రుడు దర్శనమివ్వనున్నారు. నేడు వరాహావతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. లక్ష్మణ సమేత సీతారాములకు వేదపండితులు విశేష స్నపన తిరుమంజనం నిర్వహించారు. గురువారం నరసింహావతారంలో స్వామివారు దర్శనమివ్వనున్నారు.
ఈనెల 7న వామనావతారం, 8న పరశురామావతారం, 9న శ్రీరామావతారం, 10న బలరామావతారం, ఈనెల 11న శ్రీకృష్ణావతారంలో స్వామివారు దర్శనమిస్తారు. ఈనెల 12న గోదావరిలో స్వామివారి తెప్పోత్సవం ఉంటుంది. 13న శ్రీరామచంద్రుడు ఉత్తర ద్వార దర్శనమిస్తారు. ఉత్సవాల నేపథ్యంలో ఈనెల 13 వరకు అధికారులు నిత్య కల్యాణాలు రద్దుచేశారు. అదేవిధంగా కరోనా ఆంక్షల కారణంగా తిరువీధి సేవలు, ఊరేగింపులు రద్దు చేశారు. కరోనా నిబంధనలకు అనుగుణంగానే భక్తులకు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేస్తున్నారు.