కాంట్రాక్ట్ వెటర్నరీ వైద్యులతో మంత్రి తలసాని
హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): రైతులకు నిరంతరం అందుబాటులో ఉంటూ.. పశువులకు మెరుగైన వైద్యం అందించాలని కాంట్రాక్ట్ వెటర్నరీ వైద్యులకు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ సూచించారు. పదవీకాలం పొడిగింపు ఉత్తర్వులను ఏడీ రాంచందర్ నుంచి అందుకున్న వైద్యులు.. శుక్రవారం హైదరాబాద్లో మంత్రి తలసానిని కలిశారు. పదవీకాలం పొడిగించడంపై హర్షం వ్యక్తంచేశారు. పశుసంపద పెరుగుదలకు మరింత కృషిచేయాలని ఈ సందర్భంగా తలసాని సూచించారు.