ఇచ్చోడ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా (కే) గ్రామ పంచాయతీ మరో అవార్డును సొంతం చేసుకొన్నది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ బెస్ట్ గ్రామపంచాయతీగా ఎంపికైన నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్లో నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్కుమార్ చేతుల మీదుగా సర్పంచ్ మీనాక్షి గాడ్గె ఈ అవార్డు అందుకొన్నారు.
రజత్కుమార్ మాట్లాడుతూ.. హరితహారంలో భాగంగా గ్రామంలో నాటిన మొక్కలు వంద శాతం బతకడం అభినందనీయమన్నారు.