హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని కాచిగూడ రైల్వేస్టేషన్ ‘ఇంధన పొదుపు’ విభాగంలో బెస్ట్ అవార్డు అందుకున్నది. జాతీయ ఇంధన పొదుపు దినోత్సవం సందర్భంగా బుధవారం న్యూఢిల్లీలోని విజ్ఞానభవన్లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా హైదరాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ శరత్చంద్రయాన్.. ప్రిన్సిపల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్తో కలిసి అవార్డు అందుకున్నారు. గుంతకల్ రైల్వేస్టేషన్ రెండో బహుమతి గెలుచుకున్నది.