హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా బీర్ల అమ్మకాలు పెరిగాయి. గతనెల 5న ప్రభుత్వం బీర్ల ధరపై రూ.10 తగ్గించడంతో మద్యంప్రియులు జోరు పెంచారు. నెల రోజుల్లో బీర్ల అమ్మకాలు 18 శాతం మేర పెరిగినట్టు అధికారులు తెలిపారు. సాధారణంగా నెలకు 25 లక్షల కేసుల బీర్లు అమ్ముడవుతాయి. ప్రస్తుతం అమ్మకాలు 30 లక్షల కేసుల వరకు వెళ్లినట్టు పేర్కొన్నారు.