అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సూచన
జైనూర్, మే 17: కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా చెక్పోస్టుల వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అధికారులకు సూచించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం జంగాం సమీపంలో ఏర్పాటుచేసిన చెక్పోస్టును ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి మంత్రి పరిశీలించారు. ఇతర రాష్ర్టాల నుంచి ఎవ్వరినీ అనుమతించవద్దని ఆదేశించారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని వాంకిడి చెక్పోస్ట్ను ఎస్పీ వైవీఎస్ సుధీంద్రతో కలసి రామగుండం సీపీ సత్యనారాయణ తనిఖీ చేశారు. నిత్యావసర వస్తువుల వాహనాలను మాత్రమే అనుమతించాలని సూచించారు.