హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : రోజువారీ జీవితంలో ఆన్లైన్ పేమెంట్లు భాగమయ్యాయి. బండిలో పెట్రోల్ మొదలు ఇంట్లో పాల ప్యాకెట్ వరకు ఎక్కడైనా ఫోన్పే, గూగుల్పే, పేటీఎం వంటి డిజిటల్ పేమెంట్లు పరిపాటి అయ్యా యి. అయితే, ఇది సైబర్ నేరగాళ్లకు ఒక అవకాశంగా మారే ప్రమాదం ఉన్నట్టు సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు. మన ఫోన్ పాస్వర్డ్ , యూపీఐ పిన్ నంబర్ స్ట్రాంగ్గా లేకపోతే చిక్కులు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు. ఇందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాలని వారు సూచిస్తున్నారు.