తగిన జాగ్రత్తలు తీసుకుంటే తెగుళ్ల బారి నుంచి విముక్తి
వరికి అగ్గితెగుళ్లు, నివారణ చర్యలతో దిగుబడి పెరిగే అవకాశం
సలహాలు పాటిస్తే అధిక లాభాలు
ఏడీఏ సత్యనారాయణ
ఇబ్రహీంపట్నంరూరల్, మార్చి 26: నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్, మాడ్గుల మండలాల్లో రైతులు యాసంగి సీజన్లో సుమారు 30 వేల ఎకరాల్లో వరి పంట సాగుచేశారు. ఎండలు తీవ్రమవుతున్నందున ఈ దశలో పురుగులు, తెగుళ్లు ఎక్కువగా పంటను ఆశించి, తీవ్రంగా నష్టం కలిగించే అవకాశం ఉన్నది. వరి సాగులో రైతులు సరైన సలహాలు, సూచనలు పాటిస్తే అధిక దిగుబడులు పొందవచ్చని ఇబ్రహీంపట్నం వ్యవసాయశాఖ ఏడీఏ సత్యనారాయణ సూచిస్తున్నారు.
పుష్కలంగా భూగర్భ జలాలు
ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో భూగర్భ జలాలు పైకి వచ్చి బోరు మోటర్లు పుష్కలంగా నీటిని అందిస్తున్నాయి. దీంతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోని సుమారు 30వేల ఎకరాల్లో వరిని సాగుచేశారు. పంటను రక్షించుకోవడం కోసం ఎలాంటి చీడపీడలు సోకినా సొంత నిర్ణయాలు తీసుకోకుండా స్థానికం వ్యవసాయాధికారులను సంప్రదించి పురుగు మందులు పిచికారీ చేస్తే అధిక లాభాలు పొందవచ్చని వారు సూచిస్తున్నారు.
వరి పంటకు నారుమడి దశ నుంచి పూర్తిగా గింజ పోసుకునే దశ వరకు మోగి పురు గు ఆశిస్తుంది. తల్లి పురుగు ముదురు రంగులో ఉండి ముందు రెక్కలపై నల్లటి మచ్చలను కలిగి ఉంటుంది. ఈ పురుగులు గోధుమరంగు వెంట్రుకలతో కప్పిన గుడ్లను గుంపులుగా నారుమడులలో పెడుతాయి. మొక్కల ఆకుల చివరి భాగాల్లో గుడ్లు పెడతాయి. మొక్క పిలకలు తొడిగే దశలో ఈ పురుగు ఆశిస్తే ఎండిపోయి చనిపోతాయి. పురుగు ఆశించిన మొక్కల మొవ్వలు, కంకులను లాగితే అవి తేలికగా బయటకొస్తాయి.
నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఈ పురుగు నారుమడిలో కొనలమీద గుడ్లు పెడితే నాటువేసే సమయంలో ఈ కొనలను తుంచేయాలి. నాటిన తరువాత చిరు పొట్ట దశలో పురుగును గమనిస్తే ఎకరాకు 10 కిలోల కార్బోప్యూరాన్ లేదా 8కిలోల కార్టాప్ హైడ్రోక్లోరైడ్ గుళికలను పంట పొలంలో వేయాలి. చిరుపొట్ట దశ దాటాక పంట పొలంలో పురుగులను గమనిస్తే ఎకరాకు 5వందల గ్రాములు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ పొడి మందును 2 వందల లీటర్ల నీటిలో కలిపి పైరు పూర్తిగా తడిసేలా పిచికారీ చేయాలి. లేదా ఎకరాకు క్లోరోఫైరిపాస్ 5 వందల మిల్లీలీటర్లు లేదా ఫాస్పామోడన్ నాలుగు వందల మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 300 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పురుగు తీవ్రతను బట్టి 10 నుంచి 15 రోజుల వ్యవధిలో మందులు మారుస్తూ పిచికారీ చేయాలి. చివరిగా పంటను కోసేటప్పుడు దుబ్బులను నేల మట్టం వరకు కోయాలి. దీనివల్ల మళ్లీ వచ్చే పంటలో పురుగు ఉధృతిని తగ్గించవచ్చు.
ఆకులపై, కణుపులు వెన్నులపైన కన్పిస్తాయి. ఆకులపైన నూలు కండె ఆకారపు మచ్చలు ఏర్పడతాయి. మచ్చల చివర్లు మొనదేలి అంచులు మాత్రం ముదురు గోధుమ రంగులో, మచ్చల మధ్య భాగం బూడిద రంగు ఉంటుంది. ఈ మచ్చలు పెద్దవై కలిసిపోయి ఆకు అంతటా వ్యాపిస్తాయి. మొక్కలు ఎండిపోయి దూరం నుంచి పంట తగలబడినట్లుగా కనిపిస్తుంది. ప్రస్తుతం జిల్లాలో వరి పంట వివిధ దశలో ఉన్నది. ముఖ్యంగా పిలకల దశ నుంచి చిరు పొట్ట దశలో ఉన్న పంటలో అగ్గి తెగులు ఉధృతి ఎక్కువగా ఉంది.
నివారణ చర్యలు..
సుడిదోమ.. నివారణ చర్యలు
వరిపంటకు అధికంగా నత్రజనిని అందించడం వల్ల సుడిదోమ వ్యాప్తి చెందుతుంది. గోధుమ వర్ణం కలిగిన సుడిదోమలు వరి దుబ్బుల మొదళ్ల వద్ద నీటిమట్టంపై గుంపులుగా చేరి రసాన్ని పీలుస్తుంటాయి. దీంతో పంట సుడులు, సుడులుగా ఎండిపోతుంది. ఈ సమయంలో సుడిదోమను వెంటనే నివారించకపోతే పం టంతా సుడిదోమ బారినపడి పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉన్నది. అందుకే సరైన జాగ్రత్తలు తీసుకోవాలి.
నివారణ చర్యలు ..
రైతులు ప్రతినిత్యం వరి మొదళ్లను గమనిస్తూ ఉండాలి. వరి మొదళ్లకు 20కి మించి సుడిదోమలు కనిపిస్తే ప్రతి 2 మిల్లీలీటర్లకు 30 సెంటీమీటర్ల వెడల్పులో పాయలు తీసి గాలి, వెలుతురు మొదళ్లకు తగిలేలా చూడాలి. పంటలో వెంటనే నీటిని తీసేసి ఆరుతడి పద్ధతిలో నీటిని అందించాలి. నత్రజనిని అధిక మొత్తంలో వాడకుండా తగిన మోతాదులో వాడాలి. వరిమొదళ్లకు 20 నుంచి 25 దోమలు ఆశించి ఉంటే ఎకరాకు ఇమిడాక్లోఫ్రిడ్ 40 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. 50 నుంచి 100 వరకు దోమలు ఆశించి ఉంటే ఎకరాకు ఒక లీటరు నీటికి 1.5 గ్రాములు ఎసిఫేట్ లేదా 1.5 మిల్లీలీటర్లు ఇడోఫిన్ప్రాక్స్ మొదళ్ల దగ్గర పడేలా పిచికారీ చేయాలి. చిరుపొట్ట దశకు రాని వరి పైర్లలో సుడిదోమను గమనిస్తే ఎకరాకు 10 కిలోగ్రాముల కార్పోప్యూరాన్ 3 జీ గుళికలను చల్లుకోవాలి. వరి దుబ్బులకు 100 నుంచి 200 వరకు సుడిదోమలు ఆశిస్తే ఒక లీటరు నీటికి ఎసిఫేట్ 2 గ్రాములు, డైక్లోరోపాస్ ఒక మిల్లీలీటర్ చొప్పున కలిపి పిచికారీ చేయాలి. దోమ ఉధృతి తీవ్రంగా ఉంటే బుప్రోఫెజిన్ ఒక లీటరు నీటికి 1.5 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేయాలి.