హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో బీడీ పరిశ్రమ యాజమానులకు, బీడీ కార్మికులకు వారధిగా పనిచేస్తున్న సుమారు 7 వేల మంది బీడీ టేకేదారులకు ఆసరా పింఛన్ పథకం అమలు చేసి ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత సీఎం కేసీఆర్కే దకుతుందని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, టేకేదారుల సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఎల్ రూప్సింగ్ అన్నారు.
ఆదివారం తెలంగాణభవన్లో బీడీ టేకేదారుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రూప్సింగ్ మాట్లాడుతూ.. ఆరు లక్షల మంది బీడీ కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న బీడీ పరిశ్రమను ఆదుకుంటున్న సీఎం కేసీఆర్కు యావత్తు కార్మికులు రుణపడి ఉంటారని తెలిపారు. దేశంవ్యాప్తంగా 16 రాష్ర్టాల్లో బీడీ పరిశ్రమ నెలకొని ఉంటే ఏ రాష్ట్రంలోనూ ఒక రూపాయి కూడా కార్మికులకు ఇవ్వడం లేదని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు దుంపల నారాయణ, వరింగ్ ప్రెసిడెంట్ ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి, కో-ఆర్డినేటర్ మంచె నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.