హైదరాబాద్, ఏప్రిల్1 (నమస్తే తెలంగాణ): బీసీల డిమాండ్లను బీజేపీ మ్యానిఫెస్టోలో చేర్చాలని, లేదంటే వచ్చే లోక్సభ ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. ఈ మేరకు బీసీల డిమాండ్లను నెరవేర్చాలని సోమవారం ఆయన బీజేపీకి ఒక లేఖ రాశారు. దేశంలో బీసీలు మెజార్టీగా ఉన్నప్పటికీ విద్య, ఉపాధి, రాజకీయ, ఆర్థిక, బడ్జెట్, పారిశ్రామిక రంగాల్లో ఆ మేరకు వాటా దకలేదని వాపోయారు. జనాభా నిష్ప త్తి ప్రకారం బీసీలకు తగిన వాటా కల్పించేందుకు మళ్లీ సమగ్ర అధ్యయనం చేపట్టాలని, చట్టసభల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఓబీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పా టు చేయాలని, ఎస్సీ, ఎస్టీలతో సమానంగా బీసీ విద్యార్థులకు పోస్ట్, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లను మంజూరు చేయాలని కోరారు. ప్రమోషన్లలో, స్థానిక సంస్థల ఎన్నికల్లో, ప్రైవేట్ రంగాల్లో బీసీలకు రిజర్వేషన్లు, బడ్జెట్లో బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని, క్రీమీలేయర్ను తొలగించాలని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని బీసీలకు విస్తరించాలని, రుణాలు మం జూరు చేయాలని డిమాండ్ చేశారు. ఓబీసీలకు పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టి, అందుకు తగిన బడ్జెట్ను కేటాయించాలని లేఖలో ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు.