హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): మహాత్మా జ్యోతిబాఫూలే పేరుతో బీసీ సబ్ప్లాన్ తీసుకొస్తామన్న కాంగ్రెస్ పార్టీ తొలి ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో దాని ఊసే తీసుకురాలేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో విమర్శించారు. అధికారంలోకి వస్తే బీసీ సంక్షేమానికి ప్రతీ ఆర్థిక సంవత్సరం రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని, ఐదేండ్లకు గాను లక్ష కోట్లు కేటాయిస్తామని, ఫూలే బీసీ సబ్ప్లాన్ తీసుకొస్తామని కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో గొప్పగా పేరొన్నదని తెలిపారు.
బడ్జెట్లో మాత్రం 60 శాతంగా జనాభా ఉన్న బీసీలకు రూ.8,000 కోట్లు కేటాయించడమేంటని ధ్వజమెత్తారు. ఈ నిధులు బీసీల అభ్యున్నతికి ఏమాత్రం సరిపోవడని పేర్కొన్నారు. ఈ 8 వేల కోట్లలో బీసీల, అగ్రకులాల సంక్షేమం, కల్యాణలక్ష్మి నిధులు, ఫీజు రీయింబర్స్మెంట్, సాలర్షిప్పుల బకాయిలకు 3,400 కోట్లు ఇవ్వాల్సి ఉన్నదని తెలిపారు. ఇక మిగిలిన కొద్దిమొత్తం నిధులతో బీసీల అభివృద్ధి ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఇచ్చిన హామీ మేరకు బీసీల బడ్జెట్ను వెంటనే రూ.20 వేల కోట్లకు పెంచాలని సీఎం రేవంత్రెడ్డిని జాజుల డిమాండ్ చేశారు.