హైదరాబాద్, మార్చి14 (నమస్తే తెలంగాణ): డీఎస్సీ సన్నద్ధమయ్యే అభ్యర్థులు ఉచిత శిక్షణకు ఏప్రిల్ 5లోపు దరఖాస్తు చేసుకోవాలని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డి ఒక ప్రకటనలో కోరారు. 7వేల మంది ఎస్జీటీ అభ్యర్థులకు, 3 వేల మంది స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు ఈ శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు.
ఎంపికైన అభ్యర్థులకు రూ.1500 చొప్పున బుక్ ఫండ్, స్టడీ మెటీరియల్ ఖర్చును అందిస్తామని తెలిపారు. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.5 లక్షలు మించని అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. బీఎడ్, టెట్, డైట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తామని చెప్పారు. వివరాలకు 040 24071178, 27077929 నంబర్లను సంప్రదించాలని సూచించారు.