హైదరాబాద్, డిసెంబర్6 (నమస్తే తెలంగాణ): బీసీ నేతకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్, కుల నిర్మూలన వేదిక అధ్యక్షుడు పావని నాగరాజు బుధవారం వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశారు.
జనాభాలో 60 శాతంగా ఉన్న బీసీలకు కాంగ్రెస్ పాలకవర్గంలో ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఇతర వర్గాలకు అవకాశాలు కల్పిస్తూ, బీసీలకు ఇవ్వకపోవడం ద్రోహమే అవుతుందని పేర్కొన్నారు.