కాచిగూడ, నవంబర్ 7: బీసీల సంక్షేమం కోసం పోరాడుతున్న జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యపై కుట్రలు చేసేవారిని సహించేది లేదని ఆ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ స్పష్టం చేశారు. బీసీల సమస్యలపై గత 47 ఏండ్లలో 12 వేలకుపైగా ఉద్యమాలు నిర్వహించి పాలకులనే గడగడలాడించిన కృష్ణయ్య జోలికొస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని హెచ్చరించారు. ఆదివారం కాచిగూడలో జరిగిన బీసీ సంఘాల నాయకుల సమావేశంలో కృష్ణ మాట్లాడుతూ.. చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ల కోసం ఉద్యమించరాదని, కులగణన కోసం సుప్రీంకోర్టులో వేసిన కేసులను ఉపసంహరించుకోవాలని కొందరు కృష్ణయ్యకు ఫోన్చేసి బెదిరిస్తున్నట్టు తెలిపారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదన్నారు. కార్యక్రమం లో బీసీ సంఘాల నాయకులు నీల వెంకటేశ్, నర్సింహగౌడ్, పీ సుధాకర్, జిల్లప ల్లి అంజి, అనంతయ్య, జీ శంకర్, పగిళ్ళ సతీశ్, సుచిత్కుమార్ పాల్గొన్నారు.