BC Gurukula | తెలంగాణ బీసీ గురుకుల ఇంటర్మీడియ్ ప్రవేశ పరీక్షా ఫలితాలను సోమవారం మంత్రి గంగుల కమలాకర్, సంక్షేమశాఖ కార్యదర్శి వెంకటేశం విడుదల చేశారు. 2023-24 విద్యా సంవత్సరంలో మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకుల విద్యాలయాల సంస్థ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఇటీవల ప్రవేశ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. ఫలితాల్లో ఎంపిసిలో 150 మార్కులకు గాను 122 మార్కులతో మొదటి స్థానంలో సిద్దిపేటకు జిల్లాకు చెందిన కుమారి పి. జ్యోత్స్న, బీసీపీలో నల్గొండ జిల్లాకు చెందిన కుమారి పీ శ్రీవల్లి 108 మార్కులతో, సీఈసీలో పెద్దపల్లి జిల్లాకు చెందిన కె.సాయి సంహిత 107 మార్కులతో, ఎంఈసీలో మేడ్చల్ జిల్లాకు చెందిన ఏ అర్చన 109 మార్కులతో అగ్రస్థానంలో నిలిచారు. విద్యార్థులు జూన్ ఒకటి నుంచి 10వ తేదీలోగా విద్యార్థులు కాలేజీల్లో చేరాలని, ఫలితాల కోసం mjptbcwreis.telangana.gov.in వెబ్సైట్లో చూడవచ్చని సంస్థ కార్యదర్శి తెలిపారు. కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి మల్లయ్య బట్టు పాల్గొన్నారు.