యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహా స్వామి వారిని బీసీ కవమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణ మోహన్ రావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. సభ్యులు కిశోర్ గౌడ్, సుభప్రద్ పటేల్, ఉపేందర్ కూడా స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. నేరుగా బాలలయంలోకి వెళ్లిన చైర్మన్, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చ్చి, స్వామి తీర్థ ప్రసాదాలను అందజేశారు.