కాచిగూడ, మే 15 : బీసీ సమస్యల పరిష్కారంపై మొండి వైఖరిని నిరసిస్తూ మోదీ ప్రభుత్వంపై మిలిటెంట్ ఉద్యమానికి దిగుతామని బీసీ సంక్షేమ సం ఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. ఆదివారం హైదరాబాద్లోని కాచిగూడ హోటల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రం చేపట్టబోయే జనగణనలో కుల గణన చేపట్టాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీలంటే బిచ్చగాళ్లు కాదని, బీసీలంటే వాటాదారులని తెలిపారు. దేశంలోని 75 కోట్ల మంది బీసీలకు రాజ్యాంగ హక్కులు కల్పించకుండా కేంద్రం అణచివేస్తున్నదని మండిపడ్డారు.
స్వాతం త్య్రం వచ్చి 74 ఏండ్లు దాటినా బీసీలకు ప్రజాస్వామ్యబద్ధంగా విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో న్యాయం జరగడంలేదని వాపోయారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 24న బెంగళూరులో అఖిల భారత జాతీ య స్థాయి బీసీల సదస్సు నిర్వహిస్తామన్నారు. సదస్సుకు ముఖ్యఅతిథులుగా మాజీ ప్రధా ని దేవెగౌడ, యూపీ మాజీ సీఎం అఖిలేశ్యాదవ్, 29 రాష్ర్టాల బీసీ ప్రజాప్రతినిధులు, సంఘాల నేతలు హాజరవుతారని తెలిపారు. సమావేశంలో సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, కోలా జనార్దన్, ఎన్ వెంకటేశ్, సీ రాజేందర్, భూపేశ్సాగర్, రామకృష్ణ, అంతయ్య, పండరీనాథ్ తదితరులు పాల్గొన్నారు.