హైదరాబాద్ : తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులు బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ మర్యాదపూర్వకంగా కలిశారు. బీసీ కమిషన్ చైర్మన్ డా. వకుళాభరణం కృష్ణ మోహన్ రావు, సభ్యులు సీహెచ్ ఉపేంద్ర, శుభప్రద్ పటేల్, కె. కిషోర్ గౌడ్ ఇవాళ ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు.