హైదరాబాద్, జనవరి7 (నమస్తే తెలంగాణ): వృత్తిదారులకు అండనిచ్చేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీబంధు పథకాన్ని కాంగ్రెస్ సర్కార్ సైతం యథావిధిగా కొనసాగించాలని జాతీయ ఎంబీసీ సంఘాల కన్వీనర్ కొండూరు సత్యనారాయణ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. బీసీ బంధు కింద ఇప్పటికే అనేక మందిని ఎంపిక చేశారని, ఎన్నికల కోడ్తో చెక్కుల పంపిణీ నిలిచిపోయిందని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా రజకులు, నాయీ బ్రాహ్మణులు, ఇతర వృత్తిదారులకు ఎంతో లబ్ధి చేకూరుతున్నదని, ముడిసరుకులు, యంత్ర పరికరాల కొనుగోలుకు చేయూతనిస్తుందని తెలిపారు. ఈ రాబోయే బడ్జెట్లలో ఎంబీసీ కార్పొరేషన్లకు భారీగా నిధులు కేటాయించాలని కోరారు.