హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): పిల్లలు, మహిళల సంరక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయనున్నామని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి స్థాపించిన బచ్పన్ బచావో ఆందోళన్ (బీబీఏ) సంస్థ తెలిపింది.
ఈ మేరకు రాష్ట్ర బాలల రక్షణ సం ఘం (ఎస్సీపీఎస్), మహిళ, శిశు సంక్షేమ శాఖ (డబ్ల్యూసీడీ), పోలీసుశాఖకు చెందిన మహిళా భద్రతా విభాగం (డబ్ల్యూఎస్డబ్ల్యూ)తో ఎంవోయూ కుదుర్చుకొన్నామని పేర్కొన్నది. బలవంతంగా పని చేస్తున్న, బందీలుగా ఉన్న కార్మికు లు, అక్రమ రవాణాకు గురైన పిల్లలు, మహిళల రక్షణ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయడం, వారిని రక్షించి తిరి గి సమాజంలో కలిసి పోయేలా చేయడం, పునరావాసం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేయనున్నట్టు తెలిపింది.
రాష్ట్రంలోని 12,500 గ్రామాలను ‘బాలల స్నేహపూర్వక గ్రామాలు’గా మార్చడమే లక్ష్యంగా మూడేండ్ల కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని వివరించింది. మహిళ, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్, అడిషనల్ డీజీపీ స్వాతిలక్రా, డీఐజీ సుమతి, ఐసీపీఎస్ నోడల్ అధికారి శారద, స్పెషల్ ప్రొటెక్షన్ యూనిట్ అధికారి రాకేశ్తో బీబీఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ధనంజయ్ టింగల్, సీనియర్ అధికారులు ఎం చందన గురువారం ఎంవోయూలు మార్చుకొన్నారు.