హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ) : అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులైన బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ), బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (బీసీఏ), బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ (బీఎంఎస్) కోర్సుల నిర్వహణపై అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) కీలక నిర్ణయం తీసుకొన్నది. ఈ మూడు కోర్సులను ఏఐసీటీఈ తన పరిధిలోకి చేర్చింది. అదేవిధంగా కామన్ కరికులాన్ని అమలుచేయనున్నది. ఈ మూడు కోర్సులను నిర్వహించే కాలేజీలు ఇక నుంచి ముందుగా ఏఐసీటీఈ అనుమతి పొంది.. ఆ తర్వాత వర్సిటీల నుంచి పర్మిషన్ పొందాల్సి ఉంటుంది. ఈ నిర్ణయాన్ని తెలంగాణ డిగ్రీ కాలేజీ మేనేజ్మెంట్స్ అసొసియేషన్ ప్రతినిధులు వ్యతిరేకిస్తున్నారు.