Kadiyam Srihari | జనగామ, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): స్టేషన్ఘన్పూర్ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు భగ్గుమన్నది. ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య, నియోజకవర్గ ఇన్చార్జి సింగపురం ఇందిర సాక్షిగా లింగాలఘనపురం మండలంలో విభేదాలు బయటపడ్డాయి. బుధవారం ఎన్నికల మండలస్థాయి సమీక్షా సమావేశం జరిగింది.
బీఆర్ఎస్లో ఉన్న లింగాలఘనపురం జడ్పీటీసీ వంశీధర్రెడ్డి, మరికొందరు ముఖ్యనేతలు ఇటీవల కాంగ్రెస్లో చేరారు. జడ్పీటీసీ వంశీధర్రెడ్డి ఏర్పాటు చేసిన స్వాగత ఫ్లెక్సీలను మరో వర్గం చించేసింది. పార్టీలో చేరికలు జరుగుతుండగానే ఇరువర్గాలు పరస్పరం వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తతకు దారితీసింది. తీవ్ర అసంతృప్తికి గురైన ఎమ్మెల్యే కడియం, అభ్యర్థి కావ్య మధ్యలోనే వెళ్లిపోయారని సమాచారం.