హైదరాబాద్లో : తెలంగాణ పూల జాతర బతుకమ్మ పండుగ సంబురాలను అరణ్య భవన్లో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అటవీ శాఖ అధికారిణులు, సిబ్బంది ఉత్సాహంగా సంబురాల్లో పాల్గొన్నారు. బతుకమ్మ పాటలకు లయబద్ధంగా నాట్యం చేస్తూ అలరించారు. అలాగే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, పీసీసీఎఫ్ ఆర్.ఎం.డొబ్రియల్, ఇతర అధికారులు కూడా వారితో ఆడి పాడారు. ఆడపడుచులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు.