పీఎస్హెచ్ఎం పోస్టులపై విద్యాశాఖ స్పష్టత
సంఖ్య అధికంగా ఉన్న స్కూళ్లకే మంజూరు!
హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): ప్రాథమిక పాఠశాలలకు ప్రధానోపాధ్యాయ పోస్టుల మంజూరుపై స్పష్టత వచ్చింది. విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తి ప్రాతిపదికన పీఎస్హెచ్ఎం పోస్టులను మంజూరుచేయాలని విద్యాశాఖ నిర్ణయానికి వచ్చింది.ఈ మేరకు ప్రభుత్వానికి నివేదించనున్నది. ప్రస్తుతం ఉన్నవాటిని కలుపుకుని 10 వేల కు తగ్గకుండా ప్రాథమిక పాఠశాలలకు హెచ్ఎం పోస్టులు మంజూరుచేస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ లెక్కన ఇప్పుడున్న 4,429 లో ఫీమేల్ లిట్రేచర్(ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం) పోస్టులు మినహాయిస్తే కొత్తగా 5,571 పోస్టులు సృష్టించాల్సి ఉన్నది. రాష్ట్రంలో ప్రస్తుతం 52,563 మంది ఎస్జీటీలు పనిచేస్తున్నారు. పీఎస్హెచ్ఎం పోస్టుల సృష్టితో తమకు పదోన్నతి దక్కుతుందనే ఆశతో కొంతమంది ఉన్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లో 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ చొప్పున ఉండాలి. కానీ, రాష్ట్రంలో 17 మందికి ఒక టీచర్ చొప్పున మాత్రమే పనిచేస్తున్నారు. ఈ లెక్కన విద్యార్థులసంఖ్య అధికంగా ఉన్న పాఠశాలలకే పోస్టులు మంజూరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.