హైదరాబాద్, మార్చి 24(నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం, ఎక్సైజ్ అధికారుల తీరు తో తాము బార్లు మూసుకోవాల్సిన దుస్థితి నెలకొన్నదని బార్ ఓనర్లు ఆవేదన వ్యక్తంచేశారు. మద్యం షాపుల వద్ద పర్మిట్ రూములను నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని, వీటిపై అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఎక్సైజ్ అధికారుల తీరును నిరసిస్తూ మంగళవారం తెలంగాణ బార్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆబ్కారీ భవన్ వద్ద మౌనదీక్ష నిర్వహించారు.
మద్యం షాపుల నిర్వాహకులు నిబంధనలు పాటించకపోవడంతో తాము బార్లు నడిపే పరిస్థితులు లేవని జీవో145ని తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నిర్వాహకులు పర్మిట్ రూమ్ల్లో నిబంధన లు పాటించేలా అధికారులు చొరవ చర్యలు తీసుకోవాలని, లేకుంటే తాము బెల్ట్షాపులు నడుపుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వానికి తామూ ఆ దాయం ఇస్తున్నామని, అయినా తీవ్ర అన్యాయం చేస్తున్నదని మండిపడ్డారు. ప్రభు త్వం తక్షణమే స్పందించకపోతే ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు.