హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): బాపట్ల-సుండూరు రైల్వేస్టేషన్ల మధ్య 32 కిలోమీటర్ల మేర విద్యుద్దీకరణ పనులు, మూడో రైల్వే లైను నిర్మా ణ పనులను పూర్తి చేసి ప్రారంభించినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెప్పా రు.
విజయవాడ-గుంటూరు స్టేషన్ల మధ్య కొనసాగుతున్న ట్రిప్లింగ్, విద్యుద్దీకరణ పనుల్లో భాగంగా సుండూరు-సూరారెడ్డి పాలెం మధ్య 106 కిలోమీటర్ల మేర విద్యుద్దీకరణ లైను, మూడో రైల్వే లైను అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. దీంతో ప్రయాణికులకు ప్రయాణ సమయం తగ్గుతుందని వెల్లడించారు.