హైదరాబాద్: నగరంలోని చంపాపేటలో ఓ జానపద నేపథ్య గాయకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం పిల్లిగుండ్ల తండాకు చెందిన జటావత్ మోహన్.. బంజారా పాటలు పాడేవాడు. ఆయన గత కొంతకాంగా హైదరాబాద్లోని చంపాపేటలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి తన గతిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆయన మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కాగా, మోహన్ పాడిన పలు బంజారా పాటలు యూట్యూబ్లో బాగా ప్రాచుర్యం పొందాయి. ఆయన మృతితో స్వగ్రామంలో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.