హైదరాబాద్, ఆగస్టు 26 ( నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగింపునకు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని ప్రభుత్వం అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది. భోజన విరామ సమయంలో అత్యవసరంగా విచారణ చేయాలని కోరింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాసర్రెడ్డితో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. విద్వేషాలను రెచ్చగొడుతూ బండి సంజయ్, ఆయన అనుచరులు ప్రసంగిస్తున్నారని, యాత్ర కొనసాగింపునకు సింగిల్ జడ్జి ఉత్తర్వులను కొట్టేయాలని ప్రభుత్వం కోరింది. అయితే, సింగిల్ జడ్జి తీర్పు కాపీ అందుబాటులోకి రాలేదని, అప్పీల్ పిటిషన్ విచారణకు కొంత గడువు కావాలని కోరారు. దీంతో విచారణ వాయిదా పడింది.