సిద్దిపేట : దుబ్బాక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి(Kotha Prabhakar reddy) పై హత్యాయత్నాన్ని నిరసిస్తూ సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో బంద్(Dubbaka bandh) ప్రశాంతంగా కొనసాగుతున్నది. వ్యాపార, దుకాణాలు, పాఠశాలలు, మార్కెట్లు స్వచ్ఛందంగా మూసివేశారు. దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు గ్రామ గ్రామాన నిరసన కార్యక్రమాలు చేపట్టారు. హత్యాయత్నానికి పాల్పడిన నిందితులు, రాజకీయ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ర్యాలీలు నిర్వహించారు.
ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుబ్బాక వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కొత్త ప్రభాకర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని కోరుతూ మృత్యుంజయ హోమం, ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గంలోని దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్, రాయపోల్, భూంపల్లి, చేగుంట, నార్సింగి మండలాల్లో బంద్ ప్రశాంతంగా కొనసాగుతున్నది.
బంద్తో నిర్మానుష్యంగా మారిన రోడ్డు
ప్రభాకర్రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆలయంలో పూజలు చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు
నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ కార్యకర్తలు
పోలీసుల బందోబస్తు