కోస్గి, నవంబర్ 18 : ముదిరాజ్ బిడ్డలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ ఆరోపించారు. నారాయణపేట జిల్లా కోస్గిలోని ఓ ఫంక్షన్ హాల్లో శనివారం ముదిరాజ్ల ఆత్మీ య సమ్మేళనాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి గనుల శాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి, కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బండ ప్రకాశ్ మాట్లాడు తూ.. ముదిరాజ్లు రాజకీయంగా ఎదిగే దిశ గా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. ముదిరాజ్ల ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా సొసైటీలు, మత్స్యశాఖల ద్వారా అధికారాన్ని కట్టబెట్టినట్టు పేర్కొన్నారు. హైదరాబాద్లోని కోకాపేటలో 5 ఎకరాల్లో ముదిరాజ్ భవన్ నిర్మాణాన్ని చేపట్టడంతోపాటు రూ.3 కోట్లతో మహబూబ్గనగర్లో, రూ.2 కోట్లతో వనపర్తిలో, రూ.కోటితో కొడంగల్లో, రూ.30 లక్షలతో కోస్గిలో ముదిరాజ్ భవన్ నిర్మాణాలకు భూమిపూజలు చేశామని తెలిపారు.
అంతరిస్తున్న కులవృత్తులకు సీఎం కేసీఆర్ పూర్వవైభవాన్ని తీసుకొచ్చినట్టు మంత్రి పట్నం మహేందర్రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వాలు ముదిరాజ్లను పట్టించుకోలేదని విమర్శించారు. బీఆర్ఎస్ సర్కార్ ఎన్నో అద్భుత సంక్షేమ పథకాలను అందించి, ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు సహకారం అందించినట్టు చెప్పారు. ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ను నమ్ముకుంటే నట్టేట మునిగినట్టేనని తెలిపారు.