హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): సింగరేణి సంస్థలో సమ్మెలపై మరో ఆరు నెలలు నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ఏఎం రిజ్వీ బుధవారం జీవో విడుదల చేశారు. సింగరేణి సంస్థ సీఎండీ వినతి మేరకు తెలంగాణ ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ -1971 ప్రకారం, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సమ్మెలపై నిషేధం విధించారు. మార్చి 11 నుంచి ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తాయని పేర్కొన్నారు.