హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు సంస్థల్లో మరో ఆరు నెలలపాటు సమ్మెలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. తెలంగాణ ట్రాన్స్కో, రెండు డిస్కం (ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్)లలో అత్యవసర సేవల నిర్వహణ చట్టం కింద సమ్మె చేయడం నిషేధిస్తూ ఉత్తర్వులున్నాయి. ఈ నిషేధాన్ని పొడిగిస్తూ విద్యుత్తు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్శర్మ ఉత్తర్వులు జారీచేశారు. ఇది ఈ నెల 25 తారీఖు నుంచి అమల్లోకి వస్తుంది. సాధారణంగా ఈ ఉత్తర్వులను ప్రతి ఆరు నెలలకు పొడిగిస్తూ ఉంటారు.