హైదరాబాద్,జనవరి 22 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా బల్మూరి వెంకట్, మహేశ్కుమార్గౌడ్ ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి ఉపేందర్రెడ్డి ప్రకటించారు. సోమవారం వారికి ధ్రువపత్రాలను అందించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలుగా ఉన్న కౌశిక్రెడ్డి, కడియం రాజీనామా చేయడంతో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బీ వెంకట్, మహేశ్కుమార్గౌడ్ మాత్రమే నామినేషన్లు వేయడంతో వారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.