భీమ్గల్/వేల్పూర్, అక్టోబర్ 21: అసెంబ్లీ ఎన్నికల్లో బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వెంటే ఉంటామంటూ ఏకగ్రీవ తీర్మానాలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం పల్లికొండకు చెందిన మాదిగ యువజన సంఘం సభ్యులు, మాల సంఘం సభ్యులు, వేల్పూర్ మండలం రామన్నపేట్కు చెందిన కుమ్మరి శాలివాహన సంఘం సభ్యులు మంత్రికి మద్దతుగా శనివారం ఏక్రగీవ తీర్మానం చేశారు. తీర్మాన ప్రతిని స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులకు అందజేశారు.