రాబోయే ఎన్నికల్లో చెన్నూర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న బాల్క సుమన్ను మరోమారు గెలిపించుకుంటామని మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీలోని విద్యానగర్ (19వ వార్డు), ఎస్సీ, ఎస్టీ కాలనీలకు చెందిన ప్రజలు శుక్రవారం ఏకగ్రీవ తీర్మానం చేశారు.
గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వార్డులో బతుకమ్మ ఘాట్తోపాటు పోచమ్మ గుడి నిర్మాణానికి సహకారం అందించడంపై వారు హర్షం వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. భారీ మెజార్టీతో గెలిపించి తీరుతామని స్పష్టం చేశారు. కాగా జైపూర్ మండలం రామారావుపేట గ్రామస్థులు సైతం బాల్క సుమన్కే ఓటు వేస్తామని ఏకగ్రీవ తీర్మానం చేశారు.