హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అక్రమంగా తనపై కేసులు నమోదు చేసిందని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్(Balka Suman)అన్నారు. సీఎం రేవంత్రెడ్డి(CM Revanth reddy)పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా పోలీసులు(Mancheryala police) సుమన్కు నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులు ఎదుర్కొని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటాలు చేశామన్నారు. పోరాటాలు బీఆర్ఎస్(BRS) పార్టీకి కొత్త కాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా ప్రజల పక్షాన పోరాటం చేస్తామని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా నామీద మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదుచేసారు.
ఆ కేసులో భాగంగా ఈరోజు మంచిర్యాల ఎస్సై కేసులకు సంబందించిన నోటీసులు ఇవ్వడం జరిగింది.
ఉద్యమంలో ఎన్నో కేసులను ఎదుర్కొని పోరాటం చేసిన పార్టీ మాది, కచ్చితంగా కాంగ్రెస్… pic.twitter.com/A7eU8HoyjS
— Balka Suman (@balkasumantrs) February 11, 2024