కమలాపూర్, ఆగస్టు 8: వచ్చే హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ను ఓడించేందుకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కుట్రలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆరోపించారు. ఆదివారం వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలోని గూనిపర్తి, ఉప్పల్లో నిర్వహిం చిన దళితుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. దళితబంధు పథకంతో ఓటన్నీ టీఆర్ఎస్కే పడుతాయని కిషన్రెడ్డి ఆధ్వర్యంలో కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దళితుల ఓట్లు చీల్చాలని ఎస్సీలను స్వత్రంత్ర అభ్యర్థులుగా బరిలోకి దింపేందుకు చూస్తున్నారని చెప్పారు. పాదయాత్ర చేస్తానంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దమ్ముంటే దళితబంధు పథకం కోసం కేంద్రం నుంచి రూ.50 వేల కోట్లు తీసుకురావాలని సవాల్ విసిరారు. కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి, జడ్పీచైర్మన్ మారపల్లి సుధీర్కుమార్ తదితరులు పాల్గొన్నారు.