తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్యరాజన్ ప్రతిపక్ష నాయకురాలిగా వ్యవహరించడం రాజ్యాంగ సూత్రాలకు విరుద్దమని తెలంగాణ షీప్స్ అండ్ గోట్స్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ అన్నారు.
బీజేపీ తమిళనాడు అధ్యక్షురాలిగా పనిచేసిన తమిళిసై రాష్ట్ర గవర్నర్గా పని చేయవచ్చుగానీ, సమాజ హితం కోసం పనిచేస్తున్న దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా ఆమోదించకపోవటం శోచనీయం అన్నారు. దాసోజు, కుర్రా సత్యనారాయణల పేర్లను ఆమోదించకపోవటం బీసీ, ఎస్టీలపై బీజేపీ వివక్షతకు నిదర్శనమని పేర్కొన్నారు.